Breaking News

మేడిగడ్డ బరాజ్‌కు పెరుగుతున్న వరద.. ?


Published on: 01 Jul 2025 18:59  IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత నది, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది.దీంతో బరాజ్ లోని మొత్తం ఎనిమిది బ్లాక్ లలో ఉన్న 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి