Breaking News

పల్లెవెలుగు బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు


Published on: 03 Jul 2025 10:58  IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు చిల్లర కష్టాల్ని దూరం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌ సిటీ బస్సులతోపాటు జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు నడిచే బస్సు సర్వీసుల్లో డిజిటల్‌ చెల్లింపు విధానాల్ని ప్రవేశ పెట్టింది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేనుంది.మరో వారం పది రోజుల్లో పల్లె వెలుగు బస్సుల్లో నగదు రహిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి