Breaking News

కాళేశ్వరం కమిషన్‌‌కి కీలక విషయాలు చెప్పిన హరీష్‌రావు


Published on: 11 Jul 2025 14:27  IST

కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరింత అదనపు సమాచారాన్ని ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై ఆరుసార్లు కేబినెట్‌ ఆమోదం, అలాగే అసెంబ్లీలో కూడా మూడుసార్లు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఈ వివరాలన్నీ డాక్యుమెంట్లతో సహా కమిషన్‌కు ఇచ్చానని తెలిపారు. మిగిలిన వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని వెల్లడించారు హరీష్‌రావు.

Follow us on , &

ఇవీ చదవండి