Breaking News

బోనమెత్తిన భాగ్యనగరం


Published on: 14 Jul 2025 11:54  IST

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు ఆదివారం బోనాల శోభతో కళకళలాడాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో లష్కర్‌ బోనాల జాతర ఆదివారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11.32 గంటలకు మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేవంత్‌ను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతకుముందు తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి పొన్నంప్రభాకర్‌ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి