Breaking News

శుభాన్షు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!


Published on: 15 Jul 2025 15:27  IST

అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా శుభాన్షు శుక్లా కొత్త చరిత్ర సృష్టించాడు. తన అంకితభావం, ధైర్యం మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ల కలలను నిజం చేశారు. ఇది భారత మానవ అంతరిక్ష విమాన మిషన్ – గగన్‌యాన్ వైపు మరో మైలురాయిని సూచిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి