Breaking News

అగ్ర వర్ణాల రూపంలో దళితులపై దాడులు


Published on: 15 Jul 2025 17:49  IST

అగ్ర వర్ణాల రూపంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. ఇటీవల మెదక్ జిల్లా హవేలిఘనాపూర్ మండలం బూర్గపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ గిరిజన ఇంగ్లీష్ టీచర్ నరేందర్ నాయక్ పై దాడి అమానుషం అని పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీలపై దాడులు అరికట్టేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి