Breaking News

కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత


Published on: 22 Jul 2025 15:12  IST

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న దాదాపు 68 మంది బాలికలు ఆదివారం రాత్రి భోజనం చేశారు. అనంతరం వీరిలో కొంతమందికి కడుపునొప్పి వస్తుందంటూ.. వాంతులు చేసుకున్నారు. దీంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో వారిని నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ఉదయం వరకు కోలుకున్నారు. సోమవారం వీరందరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి