Breaking News

విమాన ప్రమాదం.. శవాల అప్పగింతలో తప్పులు..


Published on: 23 Jul 2025 14:34  IST

ఎయిర్ ఇండియాకు చెందిన విమాన ప్రమాదంలో చనిపోయిన యూకే జాతీయుల డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. విమాన ప్రమాదంలో చనిపోయిన యూకే జాతీయుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా వేరే వ్యక్తుల శవాలు అప్పగించింది. వేరే వ్యక్తి శవం వచ్చిన కారణంగా ఓ కుటుంబం అంత్యక్రియల్ని ఆపేసింది. యూకే ప్రధాని ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి