Breaking News

పిన్నెల్లి బ్రదర్స్‌కి బిగ్ షాక్..


Published on: 29 Aug 2025 14:28  IST

పిన్నెల్లి సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. కొట్టివేసింది. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి