Breaking News

622కు చేరిన మృతుల సంఖ్య..


Published on: 01 Sep 2025 14:31  IST

ఆఫ్ఘనిస్తాన్‌‌‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ భూప్రకంపనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌‌‌లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 6.3గా నమోదైంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 600 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారితో అక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి