Breaking News

ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించండి..


Published on: 09 Sep 2025 15:35  IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టంపై ఆర్థికమంత్రికి నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, కె.రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్‌ తదితరులు సీఎం వెంట ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి