Breaking News

జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లకి కేటీఆర్ విజ్ఞ‌ప్తి


Published on: 10 Sep 2025 18:13  IST

దివంగ‌త మాగంటి గోపీనాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు అండ‌గా నిల‌బడాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దివంగత నేత మాగంటి గోపినాథ్‌ను స్మరించుకున్న కేటీఆర్, ఎవరూ కోరుకోని ఉప ఎన్నిక ఇదన్నారు. గోపినాథ్ హఠాత్తుగా దూరమవుతారని ఊహించలేదని చెప్పారు.  

Follow us on , &

ఇవీ చదవండి