Breaking News

పోలీస్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి


Published on: 18 Sep 2025 14:25  IST

లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 2 రోజుల పాటు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి