Breaking News

రాయవరం బాణసంచా పేలుడుపై దర్యాప్తు


Published on: 09 Oct 2025 17:46  IST

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా పేలుడుపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ నియమిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గురువారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని నియమించింది. దర్యాప్తు కమిటీ సభ్యుడుగా ఐ.జి. ఆకే రవికృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి