Breaking News

చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట


Published on: 10 Oct 2025 14:33  IST

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(శుక్రవారం) విచారణ జరిపింది. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతివాదులకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణని నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.తదుపరి విచారణ వరకూ మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు.

Follow us on , &

ఇవీ చదవండి