Breaking News

బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చింది


Published on: 14 Oct 2025 16:15  IST

బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని ఎంపీ, బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి కన్వీనర్ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఇవాళ(మంగళవారం) బీసీ సంఘాల తెలంగాణ బంద్ పోస్టర్స్‌ని ఆర్.కృష్ణయ్య, కోదండరాం, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయం జరుగలేదని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి ముద్దను లాక్కుందని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి