Breaking News

పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే


Published on: 21 Oct 2025 10:42  IST

నగరంలోని బీచ్‌రోడ్డులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్, సీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. సమాజం సురక్షితంగా ఉంది అంటే పోలీసుల కృషి కారణమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి