Breaking News

రాజన్న దర్శనాలు నిలిపివేసిన అధికారులు..


Published on: 22 Oct 2025 15:55  IST

వేములవాడ రాజన్న దర్శనాలను ఆలయ అధికారులు బుధవారం నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో రాజన్న సన్నిధికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఉదయం నుండి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్ చేసినట్లుగా భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల నుంచి వచ్చామని భక్తులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి