Breaking News

కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలు తీసుకోనున్న సర్కార్..


Published on: 23 Oct 2025 11:13  IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు.స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రి మండలి పరిశీలించనుంది. అదే విధంగా, స్థానిక ఎన్నికల్లో అమల్లో ఉన్న 'ఇద్దరు పిల్లల నిబంధన' రద్దు చేయడానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి