Breaking News

ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్..


Published on: 24 Oct 2025 10:40  IST

కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే.. హత్య నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి