Breaking News

రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి..


Published on: 24 Oct 2025 12:06  IST

రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం రాత్రి వెంగళరావునగర్‌ డివిజన్‌ లో పార్టీ అభ్యర్థి లంకాల దీపక్‌ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మజ్లిస్‌ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్యాయత్నం చేయడం దారుణమని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి