Breaking News

సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి కవిత పిలుపు


Published on: 17 Nov 2025 18:10  IST

డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (సోమవారం) సత్తుపల్లి జేవీఆర్ ఓసీ సింగరేణిలో కార్మికులతో కవిత మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా మెడికల్ బోర్డ్ కోసం కోట్లాడుతున్నామన్నారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నామని ప్రకటించారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదని... డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి