Breaking News

ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుంది..


Published on: 18 Nov 2025 15:23  IST

తాజాగా మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఈరోజు (మంగళవారం) ఉదయం 10:05 గంటలకు ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లుగా మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో హెచ్చరించారు. కసబ్‌ను మైనర్‌గా విచారణ చేయకుండానే ఉరి తీశారని మెయిల్‌లో రాశారు. 

Follow us on , &

ఇవీ చదవండి