Breaking News

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా..


Published on: 18 Nov 2025 15:26  IST

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలులో ప్రైవేటు వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు అయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కేటీఆర్.

Follow us on , &

ఇవీ చదవండి