Breaking News

భాగ్యనగరంలో ఐటీ అధికారుల సోదాలు..


Published on: 19 Nov 2025 10:51  IST

భాగ్యనగరం లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాజేంద్రనగర్ పిస్తాహౌస్ ఓనర్ నివాసంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇవాళ(బుధవారం) బ్యాంకు ఖాతాలను పరిశీలించి, లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఐటీ అధికారులు. షాగౌస్, మైఫిల్‌‌లో కూడా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి