Breaking News

ఎకరానికి 13 క్వింటాళ్ల పత్తి కొనాల్సిందే: కేటీఆర్‌


Published on: 19 Nov 2025 18:46  IST

ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ లాంటి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి సాగైతే.. కనీసం ఏ ఒక్క జిల్లాలోనూ లక్ష క్వింటాళ్ల పత్తిని కూడా ప్రభుత్వాలు కొనలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ హయాంలో ఎలాగైతే 13 క్వింటాళ్ల దాకా కొన్నారో.. ఇప్పుడూ అలానే కొనాలని డిమాండ్‌ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement