Breaking News

45 మంది మావోయిస్టులకు రిమాండ్‌


Published on: 20 Nov 2025 12:39  IST

విజయవాడ, ఏలూరుల్లో పట్టుబడిన మావోయిస్టుల్లో 43 మందికి వేర్వేరు కోర్టులు రిమాండ్‌ విధించాయి. మరో నలుగురికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని న్యాయాధికారి ఆదేశించారు. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరు, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి వచ్చే నెల 3 వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి యు. రామ్మోహన్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి