Breaking News

ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది..ఏపీ డీజీపీ స్పష్టం


Published on: 20 Nov 2025 15:54  IST

ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయ్యిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గురువారం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రంపచోడవరం చేరుకున్న డీజీపీ.. ఏవోబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రెండు వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. ఎకే 47 గన్స్, రైపిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. రెండు ఎన్ కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి