Breaking News

లక్షల కోట్ల భూమిని కాజేసేందుకు కుట్ర


Published on: 21 Nov 2025 14:26  IST

రాష్ట్రంలో భారీ భూకుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆరోపించారు‌. ఏకంగా నాలుగు లక్షల కోట్ల విలువచేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని ఆయన సంచలన ఆరోపణ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు.కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్‌ ముఠా అక్కడ వాలిపోతోందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి