Breaking News

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి


Published on: 21 Nov 2025 16:34  IST

చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని కనకామామిడి గేటు సమీపంలో గల ఎల్లో దాబా వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఇద్దరు మృతి చెందగా, రెండు కార్లలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం స్థానికంగా మరోసారి కలకలం రేపింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి