Breaking News

రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్


Published on: 27 Nov 2025 11:40  IST

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. జరీబు - మెట్ట భూముల అంశం, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. వీలైనంత వరకు త్వరితగతిన సమస్యలు పరిష్కారంపై కమిటీ దృష్టి పెట్టింది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైనా కమిటీలో చర్చ జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి