Breaking News

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్..


Published on: 08 Dec 2025 18:30  IST

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించాలని స్కూల్ ఎడ్యూకేషన్ విభాగం భావిస్తోంది. అందుకోసం పరీక్షల తేదీల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పంపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయడమే ఆలస్యం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి