Breaking News

బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు


Published on: 19 Dec 2025 11:02  IST

బంగ్లాదేశ్‌ లో కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పుల్లో గాయపడిన ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లా రాజధాని ఢాకా సహా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయాన్ని రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు ముట్టడించారు. భారత్‌, అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని డెయిలీస్టార్‌ పత్రికా కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి