Breaking News

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోరం..


Published on: 12 May 2025 12:14  IST

దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమర్దులను శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి