Breaking News

తిరుమల ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి దగ్గర చిరుత


Published on: 12 May 2025 16:16  IST

తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. వినాయకుడి గుడి సమీపంలో  రోడ్డు దాటుతూ కనిపించిందని ద్విచక్ర వాహనదారులు చెప్పారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా, చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని పారెస్ట్ అధికారులు తెలిపారు.  నడకదారిలో కొండకు వెళ్లే భక్తులు.. గుంపులుగా వెళ్లాలని.. ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి