Breaking News

ట్రంప్ వాదనను తోసిపుచ్చిన భారత్..


Published on: 13 May 2025 19:35  IST

రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్‌, పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించానని.. నా జోక్యం వల్లే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం తప్పిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుపుచ్చింది. భారత్, పాక్ మధ్య కాల్పుల విరణమణకు సంబంధించి అమెరికా జరిపిన చర్చల సమయంలో అసలు వాణిజ్య అంశమే చర్చించలేదని భారత్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి మంగళవారం (మే 13) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి