Breaking News

ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా


Published on: 14 May 2025 11:18  IST

ఇప్పుడు రూ.1.5 లక్షలుగా ఉన్న ఇంజనీరింగ్‌ ఫీజును.. రూ.2.5 లక్షలకు పెంచాలంటున్నారు. ఇలా ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతే.. మూడేళ్ల తర్వాత రూ. 5లక్షలు కావాలంటారా.. అని ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ప్రశ్నించింది. ఫీజుల ఖరారుకు సంబంధించిన కీలక సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. మూడేళ్లకోసారి ఫీజులు పెంచాల్సి ఉండగా.. ఇప్పటికే కాలేజీలు సమర్పించిన ఆడిటర్‌ నివేదికల ఆధారంగా ఫీజు నియంత్రణ కమిటీ(ఎఫ్‌ఆర్‌సీ) ఫీజులను సిద్ధం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి