Breaking News

మరోసారి వక్రబుద్ది చాటుకున్న డ్రాగన్ కంత్రీ..


Published on: 14 May 2025 11:24  IST

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా మార్చింది. డ్రాగన్ కంత్రీ బుద్దిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది. భారతదేశం అటువంటి ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌దేశంలో భాగమేనని తేల్చి చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి