Breaking News

యూపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా.. మాజీ డిఫెన్స్ సెక్రటరీ


Published on: 14 May 2025 11:33  IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డిఫెన్స్ సెక్రటరీ అజయ్‌ కుమార్‌ మంగళవారం (మే 13) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29తో యూపీఎస్సీ ఛైర్మన్‌ ప్రీతి సుదాన్‌ ఛైర్మన్‌ పదవీ కాలం ముగిసింది. దీంతో అజయ్‌ కుమార్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అజయ్ కుమార్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఆయన యూపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా నియామకమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి