Breaking News

కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్


Published on: 23 May 2025 16:43  IST

మేడిగడ్డ ను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉండొచ్చన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిటీ వచ్చే నెల 5న విచారణకు రావాలని ఇప్పటికే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. తాజాగా కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించే యోచనలో ప్రభుత్వం ఉంది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది.

Follow us on , &

ఇవీ చదవండి