Breaking News

కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి


Published on: 12 May 2025 15:51  IST

ల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ కొలువైన త్రికోటేశ్వరస్వామికి భక్తులు విశేష పూజలు చేస్తుంటారు. ఏదైనా కోరిక కోరుకుంటే స్వామివారు త్వరగా తీరుస్తారని భక్తుల విశ్వాసం. ఇవాళ(సోమవారం) వేల సంఖ్యలో భక్తులు కోటప్పకొండకు తరలి వచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. గిరిప్రదక్షిణ చేస్తూ ప్రసాద్(50) అనే భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు.

Follow us on , &

ఇవీ చదవండి