Breaking News

ఆర్టీసీ బస్సు బోల్తా, ముగ్గురికి గాయాలు


Published on: 19 May 2025 14:19  IST

ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలైన సంఘటన సోమవారం కొత్తకోట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ బస్సు కడప నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా కొత్తకోట మండలం పాలెం గ్రామం జాతీయ రహదారి పై అదుపుతప్పి రోడ్డు కిందికి వెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారని, వీరిలో కర్నూలు ప్రాంతానికి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ఎస్సై ఆనంద్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి