Breaking News

మొస్సాద్‌ డ్రోన్‌ ఫ్యాక్టరీనీ ధ్వంసం చేసిన ఇరాన్‌ !


Published on: 17 Jun 2025 13:31  IST

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతుంది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారని స్థానిక మీడియా పేర్కొంది. పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలతో నిండిన చిన్న డ్రోన్‌లను మోహరించాలని మొస్సాద్‌కు చెందిన ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి