Breaking News

తెలంగాణలో అప్పటి వరకు వానలే.. హెచ్చరించిన ఐఎండీ


Published on: 18 Jun 2025 18:43  IST

తెలంగాణలో ఈ నెల 22 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధశారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్క వర్షాలు పడేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి