Breaking News

రాజోలి రైతుల‌కు బేడీలు..సీఎం పై మండిప‌డ్డ కేటీఆర్


Published on: 18 Jun 2025 18:49  IST

పెద్ద ధన్వాడలో గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే దారుణమైతే.. చివరికి దొంగలు, నేరస్తుల లాగా బేడీలు వేయడం క్షమించరాని నేరం అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల విషయంలో ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి రేవంత్ వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి