Breaking News

‘మల్లన్న’ క్షేత్రానికి 15 లక్షల విరాళం


Published on: 23 Jun 2025 18:55  IST

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల వసతుల కోసం 100 కాటేజీలు నిర్మించేందుకు ప్రారంభించిన డోనార్‌ స్కీంకు దాతల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని ఈవో అన్నపూర్ణ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ బొద్దుల రామన్‌దేవిక దంపతులు 100 కాటేజీలలో ఒక్క కాటేజీ నిర్మాణం కోసం రూ.15 లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయంలో ఈవోకు అందజేశారు. కాటేజీల నిర్మాణం కోసం ఇప్పటి వరకు దాతల నుంచి రూ.95 లక్షలు విరాళంగా అందినట్టు ఈవో తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి