Breaking News

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపింది నేను..మళ్లీ పాతపాటే..!


Published on: 26 Jun 2025 15:41  IST

భారత్‌-పాక్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పాత పాటే పాడారు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం తన ఘనతే అని పదేపదే ప్రకటించుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి