Breaking News

సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్


Published on: 27 Jun 2025 12:12  IST

పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు మాజీ సీఎం కారు కింద నలిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ రెడ్డి వాహనాన్ని రవాణా శాఖ ఈరోజు(శుక్రవారం) తనిఖీ చేశారు. సింగయ్య మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు.

Follow us on , &

ఇవీ చదవండి