Breaking News

ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం : మంత్రి సీతక్క.


Published on: 27 Jun 2025 16:51  IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హుడికీ ఇండ్లు మంజూరు చేయాలని కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం ములుగు మండల కేంద్రం నుండి జీవింతరావుపల్లి గ్రామం మీదుగా గణేష్‌పల్లి వరకు రూ. 3.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి