Breaking News

మరణశిక్ష విధించిన విశాఖ కోర్టు..?


Published on: 27 Jun 2025 18:17  IST

2021 ఏప్రిల్‌ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హతమార్చాడు. జుత్తాడలోని బత్తిన,బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి. ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిని కత్తితో నరికిచంపేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Follow us on , &

ఇవీ చదవండి